HyderabadPoliticalTelangana

గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి..

గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి..

గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి..

మహిళా వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో గ్యాస్ పేలి మహిళ మృతి చెందిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే జూబ్లీహిల్స్ రహమత్ నగర్ , కమాన్ గల్లీ లోని గోపాల్ సింగ్ , లలితా బాయ్ కుమార్తె సోను బాయ్ (40) ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉన్నారు.

ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సోను బాయ్ (40) వంటగదిలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై , ఒక్కసారిగా మంటలు వ్యాపించి గ్యాస్ పేలింది. గ్యాస్ పేలడంతో పక్కనే ఉన్న సోను బాయ్ అక్కడికక్కడే మృతి చెందింది.

పక్క గదిలో ఉన్న కుటుంబ సభ్యులు గోపాల్ సింగ్ , లలిత సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

మహిళ మృతి చెందిందని వైద్యులు నిర్ధారణ అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని, మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం వారి కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ఘటన పై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button