
భద్రాచలం లో 50.4 కేజీల గంజాయి పట్టివేత.
ఒరిస్సా నుంచి కేరళకు కారు లో గంజాయి తరలింపు..
నిందితుల నుంచి రూ. 17 వేలు స్వాధీనం.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జనవరి 28,
ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుంచి కేరళకు కారులో అక్రమంగా తరలిస్తున్నటువంటి గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పట్టుకున్నారు. 50.4 కేజీల గంజాయి తో పాటు రూపాయలు 17,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే.తిరుపతి ఆధ్వర్యం లో ఎస్సై సిహెచ్.శ్రీ హరి రావు మరియు సిబ్బంది కలిసి భద్రాచలం నుండి నెల్లిపాక రోడ్డు లో తనిఖీలు తనిఖీలు చేపట్టారు. భద్రాచలం ఇసుక రీచ్ సమీపం లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక ఫ్లాట్ కారు ను ఆపి తనిఖీ చేయగా కారు లో కేజీల గంజాయి లభ్యమైంది.
తదుపరి విచారణ లో ఇట్టి గంజాయి ని తిరువనంతపురం (కేరళ)కి చెందిన ఏ 1) అక్షయ్ సురేష్ , ఏ 2) కుంజుమాన్ సురేంద్రన్ మినిమోల్ మరియు ఏ 3) అనంత కృష్ణన్ లు ఒడిశా రాష్టం లోని మల్కాన్ గిరి నుండి తిరువనంతపురం (కేరళ) కు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు..
తదుపరి విచారణ నిమిత్తం ఇట్టి గంజాయిని , ఫ్లాట్ కార్ ను , ముగ్గురు ముద్దాయిలను , 4 సెల్ ఫోన్లను మరియు రూ. 17 వేల నగదును సీజ్ చేసి ( వీటి మొత్తం విలువ 28 లక్షల 70 వేల రూపాయలు) భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించడమైనది..
ఈ తనిఖీల లో హెడ్ కానిస్టేబుల్ యం.ఏ.కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, హనుమంతరావు, వీరబాబు , ఉపేందర్ లు ఉన్నారు.
గంజాయిని పట్టుకున్న టీం ను తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ అభినందించారు.
ఏదైనా గంజాయి కి సంబంధించిన సమాచారం ఉంటే ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 కు సమాచారం అందించగలరని, మీ వివరాలు గోప్యం గా ఉంచబడతాయి అని ఈ ఎస్ తిరుపతి తెలియజేశారు .



