
సర్పంచ్ పై వార్డు సభ్యుల ఫిర్యాదు…
Web desc : టేకులపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ బోడా బాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు.
ఎవరి అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా పనులు చేయిస్తున్నారని మంగళవారం ఎంపీడీవో మల్లేశ్వరికి, ఎంపీవో గణేష్ గాంధీకి, రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్న సర్పంచ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు రామకృష్ణ, కిరణ్, గణేష్, ఉష, కొక్య డిమాండ్ చేశారు.



