KhammamPoliticalTelangana

ఏన్కూరులో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఏన్కూరులో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఏన్కూరులో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన టీడీపీ నేతలు

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 29 2026: స్థానిక మండలంలోని ప్రధాన సెంటర్‌ నందు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకుంటూ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎల్లప్పుడూ పనిచేసే పార్టీగా నిలుస్తుందని తెలిపారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button