
డాక్టర్లు లేరు.. నర్సులతోనే వైద్యం
web desc : జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం అందిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రానికి దూరంగా ఉండటం, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటే ఆర్థిక భారం కావడంతో పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారు.
కానీ డాక్టర్లు లేకపోవడంతో మెరుగైన వైద్యం అందడం లేదు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వావిలాల ప్రభుత్వ ఆసుపత్రికి శాశ్వత డాక్టర్లను నియమించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.




