PoliticalTelangana

బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా డోర్నకల్ పట్టణ కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ శ్రేణులతో కలిసి గాంధీ బొమ్మ కూడలిలో కాంగ్రెస్ వేదిక మీదుగా ప్రదర్శన జరిపారు.

డోర్నకల్ నియోజక వర్గంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో పాటు 17 మందిపై పోలీసులు మంగళవారం (జూన్ 3) కేసులు నమోదు చేశారు. సోమవారం (జూన్ 2) డోర్నకల్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ – కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ కేసులు నమోదయ్యాయి.

పోలీసులు విధులను నిర్వర్తించడంలో ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై డోర్నకల్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనకు కారణమైన రాజకీయ పరిణామాలు మరింత తీవ్రతకు దారితీశాయి. సోమవారం జరిగిన ర్యాలీల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడంతో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి.

రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతలను నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే కొన్ని చోట్ల పోలీసులు జోక్యం చేసుకున్నా, ఘర్షణను పూర్తిగా ఆపలేకపోయారు.

ఈ నేపథ్యంలోనే పోలీసులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. రెడ్యానాయక్, మరికొంతమందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసులతో డోర్నకల్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉండగా, మరోకొంతమందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులు పూర్తిగా రాజకీయ కక్షల నేపథ్యంలోనే వచ్చాయని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తమ నేతలను లక్ష్యంగా చేసుకొని ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెడ్యానాయక్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ కాంగ్రెస్ పన్నాగాలే. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిగా మారితే ప్రతీ ఒక్కరికి బుద్ధి చెప్తాను అంటూ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.

ఇక కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రెడ్యానాయక్ మాటలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

పోలీసులు తమ విధి నిర్వహిస్తున్నారని, లా అండ్ ఆర్డర్‌ను కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే, ఈ ఘర్షణల నేపథ్యంలో డోర్నకల్ నియోజకవర్గం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా పరిస్థితి అదుపులోకి వచ్చినా, రాజకీయ వేడి మాత్రం మాడలేదనే చెప్పాలి. ఇటువంటి పరిణామాలు కొనసాగితే, స్థానికంగా మలుపులు తిరిగే అవకాశాలు లేకపోలేదు.

డోర్నకల్ ప్రజలు మాత్రం శాంతి కాంక్షిస్తూ, నాయకులు బహిరంగ ప్రసంగాల పట్ల జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పెరిగే అవకాశం ఉండటంతో, పోలీసులు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button