
మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత
హైదరాబాద్లో విషాదం నెలకొంది. ప్రముఖ నాయకుడు, మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు సమాచారం.
పరిస్థితి విషమించడంతో ఆయన్ను వెంటనే హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనను అత్యవసర చికిత్స విభాగం (ICU)లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మంత్రి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆసుపత్రి వర్గాల నుంచి హెల్త్ బులెటిన్ రావాల్సి ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.




