
ఆస్పత్రిలో విధులకెళ్లిన మహిళ.. తిరిగిరాని లోకాలకు
వనపర్తి జిల్లా | నర్సింగాయపల్లి. సి కె న్యూస్
నర్సింగాయపల్లి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్య సిబ్బందిగా పనిచేస్తున్న ఇందిరా (47) విధుల్లో ఉండగా బాత్రూంలో అపస్మారకంగా పడిపోయారు.
సిబ్బంది తలుపులు తెరిచి ఆమెను బయటకు తీసుకొచ్చి వైద్య చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
అస్వస్థత కారణమా..? గుండెపోటా..? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కారణాలపై ఆరా తీస్తున్నారు




