
‘నిన్ను సాయంత్రంలోగా చంపేస్తాం’.. ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్
బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. ఇవాళ సాయంత్రంలోగా చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ హాజరైన సమయంలోనే ఈ కాల్ వచ్చింది.
ఫోన్ను ఎంపీ పీఏ లిఫ్ట్ చేయగా, కాల్లో ఉన్న వ్యక్తి తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టునని తెలిపి, ప్రాణ హానికి పాల్పడతానని బెదిరించాడు.
ఈ విషయాన్ని వెంటనే డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులకు ఎంపీ రఘునందన్ తెలియజేశారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో పోలీసులు ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. కాల్ను ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.