
సకాలంలో జెసిబి లేకపోతే ప్రయాణం లేదు.
” ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.”
“చినుకు పడితే చిరాకే” భవిష్యత్తుని గుర్తించిన సీకే న్యూస్.”
“ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రయాణకులకు శాపంగా మారింది.”
” వెంకటాపురం మండల సీకే న్యూస్ రిపోర్టర్ ముల్తాని.”
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో యాకన్న గూడెం గ్రామ శివారిలో గల రాళ్లవాగు వంతెన నిర్మాణం విషయంలో అశ్రద్ధ వహించిన ప్రభుత్వం, పాత్రికేయ బృందం కథనాలు ప్రచురింపజేసిన అధికారులు సకాలంలో స్పందించక పోవడం వలనే ప్రయాణిక ఇబ్బందులకు కారణం, నియోజకవర్గ ఎమ్మెల్యే తనిఖీ చేసిన ఫలితం సున్నా…
రాష్ట్రవ్యాప్తంగా తొలకరి చిరుజల్లు కురిస్తేనే వెంకటాపురం- భద్రాచలం రహదారి ప్రయాణం ఇలా ఉంటే వర్షాకాలంలో ఇక ముసురు పడితే ప్రయాణం ఎలా అని ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.. ఇకనైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలవుతాయో లేదో అన్న విషయం పక్కనపెట్టి, కనీసం రహదారి పనులను వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు..