
పాత కక్షలతో వ్యక్తి పై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు
కూసుమంచి : పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన మండలంలోని లోక్య తండాలో శుక్రవారం ఉదయం జరిగింది.
గ్రామానికి చెందిన వడ్త్యా హేమ్లఫైమస్తాన్ పై తేజావత్, నాగేంద్రబాబులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన హేమ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



