
వెక్కి వెక్కి ఏడ్చిన KCR (VIDEO)
బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి మాధాపూర్లోని ఆయన నివాసానికి వెళ్లారు.
ఇక ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు కేసీఆర్. మాగంటి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అంతేకాదు వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ఇక ఇలా ఉండగా ఉదయమే మాగంటి మృతి విషయం తెలిసిన వెంటనే కూడా సౌమ్యుడు.. ప్రజా నేత కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాగంటి మృతదేహాన్ని సందర్శించి భావోద్వేగానికి గురయ్యారు.
ఇక మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాగంటి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మహాప్రస్థానంలో ఇవ్వాల సాయంత్రం 3 గంటల నుంచి అంత్యక్రియల ర్యాలీ కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. మాగంటి కుటుంబ ఆలోచన మేరకు మాత్రమే ఇలా చేస్తున్నామన్నారు.
ఇది ఇలా ఉండగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఇక తెలుగు దేశం పార్టీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.
టీడీపీలో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో రెండు సార్లు ఇలా వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నుంచి ఎన్నికయ్యారు మాగంటి గోపీనాథ్.. ఈనెల జూన్ 5వ తేదీన ఉన్నట్టుండి ఇంట్లో కుప్పకూలిపోవడంతో గచ్చిబౌలి నుంచిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేర్పించారు.
అప్పటినుంచి వెంటిలేటర్ పై చికిత్స పొందిన మాగంటి ఈ రోజు ఉదయం 5:45 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రధానంగా ఆయన గుండె సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక మాగంటి గోపీనాథ్ మృతి మాత్రం గులాబీ పార్టీకి తీరని లోటు.