సమయపాలన పాటించని ఉద్యోగులకు కలెక్టర్ షాక్
సమయానికంటే ముందే వెళ్లారు.. 14 మంది ఉద్యోగులపై కలెక్టర్ చర్యలు;
By : Ck News Tv
Update: 2025-02-09 04:51 GMT
సమయపాలన పాటించని ఉద్యోగులకు కలెక్టర్ షాక్
సమయానికంటే ముందే వెళ్లారు.. 14 మంది ఉద్యోగులపై కలెక్టర్ చర్యలు
అనుమతి లేకుండా కార్యాలయం నుంచి సమయం కంటే ముందుగానే వెళ్లిపోయిన ఉద్యోగులపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చర్యలు తీసుకున్నారు.
జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న 14 మంది సిబ్బంది శుక్రవారం విధులకు వచ్చి అటెండెన్స్లో సంతకం చేసిన వెంటనే వెళ్లిపోయినట్లు తెలిపారు. వారి ఒక రోజు వేతనం నిలుపుదలతో పాటు సర్వీస్ను కౌంట్ చేయొద్దని ఆదేశిస్తూ ఎఫ్ఆర్ 18 ప్రకారం, శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.