PoliticalTelangana

తెలంగాణ సీఎస్ అకౌంట్ హ్యాక్…

తెలంగాణ సీఎస్ అకౌంట్ హ్యాక్…

తెలంగాణ సీఎస్ అకౌంట్ హ్యాక్…

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి తన డీపీని ఉపయోగించి దుర్మార్గులు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం..శాంతి కుమారి, ఐఏఎస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీపీని ఉపయోగించిన కొందరు దుర్మార్గులు.

తెలంగాణకు చెందిన, మొబైల్ నంబర్ +977-984-4013103 తో నకిలీ కాల్స్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో ఫిర్యాదు చేయబడింది. FIR నం. 4/2024 తేదీ 28-04-2024 ప్రకారం కేసు బుక్ చేసారు పోలీసులు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

కాగా భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు ప్రజలను మోసం చేసి డబ్బు దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

అలాంటి కొత్త కుంభకోణంలో ఫేక్ వాయిస్ కాల్ స్కామ్ ఒకటి. మోసగాళ్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫేక్ వాయిస్ కాల్స్ క్రియేట్ చేసి డబ్బులు ఇచ్చి మోసం చేస్తున్నారు.

ఇలాంటి ఫేక్ కాల్స్ అందుకున్న భారతీయుల్లో సగం మంది అసలైన కాల్ కు, ఏఐ జనరేటెడ్ ఫేక్ వాయిస్ కాల్ కు మధ్య తేడాను గుర్తించలేకపోతున్నామని అంగీకరించారు.

మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ కాల్స్ అందుకున్న వారిలో 83 శాతం మంది ఉచ్చులో పడి డబ్బు కోల్పోయారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button