
జన్వాడ ఫార్మ్ హౌస్ నాదే.. కేటీఆర్కు సంబంధం లేదు
Web desc : జన్వాడ ఫార్మ్ హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం, రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ఫార్మ్ హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ జన్వాడ ఫార్మ్ హౌస్ ఉన్న భూమి నా సొంతం.
ఈ ఫార్మ్ హౌస్ భూమికి కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేదు. కేటీఆర్, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. నా సొంత ప్రాపర్టీ అయిన జన్వాడ ఫార్మ్ హౌస్ను కేటీఆర్కు లీజ్కు ఇచ్చాను.
ప్రస్తుతం ఈ ఫార్మ్ హౌస్ను పరిశీలించేందుకు రాజకీయ పార్టీల నేతలు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు ఏమైనా అనుమానాలు ఉంటే, నాకు నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చు. ఫార్మ్ హౌస్ భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవు.
ఈ భూములకు లీగల్గా క్లియర్ టైటిల్ ఉంది. ప్రభుత్వ అధికారులు ఏవైనా వివరాలు లేదా పత్రాలు కోరితే, చట్టపరమైన విధానంలో వాటిని సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే రాజకీయ పార్టీల నేతలు వచ్చి వ్యక్తిగత ఆస్తిని పరిశీలిస్తామంటూ రాజకీయ వివాదం చేయడం సరికాదు.
జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నా సొంతం. కేటీఆర్ నా చిన్ననాటి స్నేహితుడు. నా ప్రాపర్టీని ఆయనకు లీజ్కు ఇచ్చాను. ప్రభుత్వానికి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు లేదా నోటీసులు ఇవ్వవచ్చు. చట్టపరమైన ప్రక్రియకు నేను పూర్తిగా సహకరిస్తాను అని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు.




