HyderabadPoliticalTelangana

నా భార్యను సీఐ దూరం చేశాడు అంటూ ఎస్పీకి భర్త ఫిర్యాదు

నా భార్యను సీఐ దూరం చేశాడు అంటూ ఎస్పీకి భర్త ఫిర్యాదు

నా భార్యను సీఐ దూరం చేశాడు అంటూ ఎస్పీకి భర్త ఫిర్యాదు

‘ఏడేళ్ళుగా ప్రేమించుకున్నాం. పెద్దలను ఎదిరించి పెళ్ళి కూడా చేసుకున్నాం. అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశారు.ఈ కేసు నేపథ్యంలో నా భార్యతోపాటు నేను కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాను.

అయితే సీఐ నా భార్యను వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు. అదేంటని అడగ్గా నాపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు’అని ఓ యువకుడు వాపోయాడు.

ఈ మేరకు సదరు సీఐపై ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తన భార్యను తనకు అప్పగించడంతోపాటు సీఐపై చర్యలు తీసుకోవాలని ఆ యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది అన్నమయ్య జిల్లాలో జరిగింది.

ఇంటర్ నుంచి హారికతో ప్రేమాయణం. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లి పంచాయతీ బూడిదగడ్డపల్లికి చెందిన ముక్కండ్ల ఉత్తన్న చిన్న కుమారుడు వినోద్‌కుమార్ ఇంటర్‌ వరకు చదువుకున్నాడు.

అయితే మోల్డింగ్ కమ్మి బెండింగ్ పనులు చేసుకుంటున్నాడు. అయితే బి.కొత్తకోట మండలంలో ఇంటర్ చదువుతున్న సమయంలో సూరపువారిపల్లి పంచాయతీ దయ్యాలచారిపల్లికి చెందిన జయరామిరెడ్డి కుమార్తె హారికతో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరి ప్రేమ పెళ్లికి ఇరుకుటుంబాల సభ్యులు అంగీకరించలేదు. కులాలు వేర్వేరు కావడంతో పెళ్లికి ససేమిరా అన్నారు. ముఖ్యంగా హారిక తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు.

ఒరిస్సాలో పెళ్లి చేసుకున్న జంట . అయితే ఏడాది క్రితం వినోద్‌కుమార్, హారికలు ఇంటినుంచీ వెళ్ళి పోయారు. అయితే అందరి సమక్షంలో పెళ్ళి చేస్తామని హారిక తల్లిదండ్రులు హామీ ఇచ్చి ఇద్దరినీ వేర్వేరు చేశారు.

ఈ క్రమంలో హారికకు పెళ్ళి సంబంధాలు చూస్తుండటంతో ఫిబ్రవరి 25న ఇద్దరు ఇంటి నుంచీ మరోసారి వెళ్లిపోయారు. మళ్లీ ప్రేమికులను పిలిపించి పోలీసులు, పెద్దలు కలసి పంచాయతీ చేశారు.

అయితే పదిరోజుల కితం ప్రేమికులు ఇరువురూ ఇంటినుంచీ వెళ్ళిపోయి. గతంలో రెండుసార్లు వెళ్లిపోయిన ఈ జంట పెళ్లి చేసుకోలేదు. కానీ ఈసారి ఒరిస్సాలో పేట గ్రామంలోని అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నారు.

ఎస్పీకి వినోద్ కుమార్ ఫిర్యాదు . పెళ్లి చేసుకున్న వారం రోజుల తర్వాత హారిక మొబైల్ లొకేశ్‌ను ఆధారంగా బి.కొత్తకోట పోలీసులు ఫోన్ చేసి పోలీస్ స్టేషనుకు రమ్మని పిలిచారు. దీంతో నవదంపతులు బుధవారం రాత్రి 7.30గంటలకు బి.కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రేమికులు ఇరువురూ మేజర్లు.

అయితే బి.కొత్తకోట సీఐ ప్రేమించి పెళ్ళి చేసుకున్న తమకు రక్షణ కల్పించాల్సింది పోయి ఏకపక్షంగా హారికను వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు అని ప్రియుడు వినోద్ కుమార్ ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.’నా భార్య హారికను సీఐ వారి తల్లిదండ్రులు అప్పగించి వెంటపెట్టి పంపించేశారు.

ఇదేమని అడిగితే ఎక్కువ మాట్లాడితే కేసులు బుక్ చేసి జైల్లో పెడుతానంటూ బి.కొత్తకోట సీఐ దౌర్జన్యం, బెదిరింపులకు గురిచేశారు. నా భార్యను నాకు అప్పగించాలని అడిగితే పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ నుంచీ బయటకు పంపించేశారు’అని వినోద్ కుమార్ ఫిర్యాదు చేశాడు.

విచారణకు ఆదేశించిన ఎస్పీ నవ వరుడు వినోద్ కుమార్ ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రంగంలోకి దిగారు. బి.కొత్తకోట సీఐపై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డిషనల్ ఎస్పీని ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button