
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్ల నిధులు
తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా నిలిచిపోయిన సినిమా అవార్డుల ప్రదానానికి కొత్త ఊపిరినిచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఫౌండేషన్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది.

అయితే, ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహాణలోనూ గద్దర్ ఫౌండేషన్కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును కాంగ్రెస్ సర్కార్ జారీ చేసింది. మరోవైపు, గద్దర్ పేరుతో సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులను అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
అయితే, ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొననున్నారు.