HyderabadPoliticalTelangana

కేసీఆర్ పై కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పై కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పై కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

ఒక మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్‌లో పాల్గొన్న ఆమె, కేసీఆర్‌ను ఒక ‘మరమనిషి’ (రోబో)గా అభివర్ణిస్తూ సంచలన విమర్శలు చేశారు.

ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఎప్పుడూ గొప్ప వ్యక్తి అని, ఆ పాత్రలో ఆయనతో ఎవరికీ ఎటువంటి సమస్యలు లేవని కవిత ప్రశంసించారు. అయితే, ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ప్రజలకు పూర్తిగా దూరమయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పరిపాలనా కాలంలో కేసీఆర్ కేవలం ఒక యంత్రంలా పనిచేశారని, అందువల్లే ఆయనకు ప్రజల భావోద్వేగాలు అర్థం కాలేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఆయన ఎంత కఠినంగా ఉండేవారంటే, కన్నబిడ్డగా తనకే తన సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు.

సొంత కుటుంబ సభ్యులకే అందుబాటులో లేని వ్యక్తి, ఇక సామాన్య ప్రజల కష్టాలను ఎలా వింటారని ఆమె ప్రశ్నించారు. ఉద్యమ నాయకుడి నుండి ఒక యంత్రంలాంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మారిన తీరే ప్రస్తుత రాజకీయ పరిణామాలకు కారణమని కవిత తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button