
పేకాట స్థావరాలపై పోలీసులు దాడి…
పోలీసుల అదుపులో నలుగురు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/పినపాక, ప్రతినిది, ( సాయి కౌశిక్),
జూన్ 13,
పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురు జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఈ. బయ్యారం పోలిస్టేషన్ పరిధిలోని టీ కొత్తగూడెం గ్రామ శివారులోని కొందరూ వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సంయుక్తంగా శుక్రవారం దాడి చేసి పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేశామన్నాడు.
మరో నలుగురు వ్యక్తులు పారిపోయారని తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 5,100లు, 5 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 8 మంది నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా ఎస్సై తెలిపారు.